రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందం, గర్వంతో నింపుతున్న సందర్భమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు గర్వించే క్షణమని, ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అన్ని వర్గాలవారు పాల్గొన్నారని, తెలంగాణ కోసం అనేకమంది త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకు, వారి అంకితభావానికి హృదయపూర్వకంగా నివాలి అర్పిస్తున్నాన్నారు.
Tags :