సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక
సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. 2021-22 సంవత్సరానికి సింగరేణి కాలరీస్ సంస్థ గడిచిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు అందించాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. 2020, 2021 లో కార్మికులకు లాభాల్లో వరుసగా 28 శాతం, 29 శాతం వాటాను దసరా కానుకగా చెల్లించిన విషయం తెలిసిందే.
Tags :