Radha Spaces ASBL

అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్

అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్

అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు.  రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని సీఎం వైఎస్‌ జగన్‌ వేదపండితుల మంత్రోచ్చారణతో కూడిన సంకల్పం తీసుకొని ఆరు రోజుల క్రితం ఈ మహాయజ్ఞన్ని  ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది పండితులు నిర్ణయించిన సముహూర్తాన తిరిగి సీఎం జగన్‌ చేతుల మీదుగానే అఖండ పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీసత్వాత్మానందేంద్ర స్వామి, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ,  మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :