Radha Spaces ASBL

'ఆచార్య' విడుదల తేదీ పై చిరంజీవి, కొరటాల శివలపై మహేష్ బాబు అసంతృప్తి!

'ఆచార్య'  విడుదల తేదీ పై చిరంజీవి, కొరటాల శివలపై మహేష్ బాబు అసంతృప్తి!

'ఆచార్య' సినిమాను ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఏప్రికల్ ఒకటో తేదికి మార్చిన సంగతి తెలిసిందే. ముందుగా ప్లాన్ చేసుకున్న 'సర్కారు వారి పాట' ఏప్రిల్ ఒకటిన సినిమాతో మహేష్ బాబు సిద్ధంగా వున్నాడన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ప్రస్తుతం రిపోర్ట్ నెగిటివ్ వచ్చినదని ట్వీట్ చేసారు. కరోనా సోకడంతో అన్నయ్య రమేష్ బాబు మరణిస్తే కూడా చివరి చూపు చూసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. అయితే మహేష్ బాబు ఇప్పుడు చిరంజీవి, కొరటాల శివ, ఆచార్య టీం మీద  కోపంగా  ఉన్నట్టు తెలుస్తోంది.  

'సర్కారు వారి పాట' ఏప్రిల్ ఒకటినవిడుదల ఉందన్న విషయం ఆచార్య టీంకి తెలుసు అయినా సరే "ఫిబ్రవరి 4వ తేదీనా రావడం లేదు.. సినిమాను వాయిదా వేస్తున్నాం.. ఏప్రిల్ ఒకటిన విడుదల చేస్తున్నామ్" అని ప్రకటించడంతో మహేష్ బాబు ఆచార్య టీం మీద కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తనను సంప్రదించుకుండానే, తన నిర్ణయం ఏంటో తెలుసుకోకుండానే ఆచార్య టీం ప్రకటన చేసిందని, సర్కారు వారి పాట కోసం ఫిక్స్ చేసుకున్న తేదీని లాక్కున్నారంటూ మహేష్ బాబు కాస్త అసంతృప్తిని వ్యక్తపరిచాడట. మరీ ముఖ్యంగా కొరటాల శివ తనకు ఎంతో సన్నిహితుడు.. తాను కూడా ఒక మాట ముందు చెప్పలేదని మహేష్ బాబు ఫీలవుతున్నాడట. దీంతో మహేష్ బాబు పంతానికి దిగేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయాలని మహేష్ బాబు అనుకుంటున్నాడట. ఒకవేళ అదే నిజమైతే.. ఆచార్య, సర్కారు వారి పాట పోటీతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే. కానీ సర్కారు వారి పాట షూటింగ్ మరింత ఆలస్యం కానుందని సమాచారం. మహేష్ బాబుకు కరోనా సోకడం, బయటి పరిస్థితులు కూడా బాగాలేకపోవడంతో షెడ్యూల్ వాయిదా పడేట్టు కనిపిస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :