Radha Spaces ASBL

కరోనాపై చైనా ఉక్కు అస్త్రం...

కరోనాపై చైనా ఉక్కు అస్త్రం...

కరోనా మహమ్మారి విషయంలో చైనా ఏ మాత్రం ఆలసత్వానికి చోటివ్వడం లేదు మరో నెల రోజుల్లో బీజింగ్‌ ఒలింపిక్స్‌ కు అతిథం ఇవ్వనుండడం కూడా అక్కడి సర్కారు కరోనాపై కఠినంగా వ్యవహరించేలా చేస్తోంది. చాలా ప్రాంతాల్లో క్వారంటైన్‌ క్యాంపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. రైలు పెట్టెల మాదిరిగా ఇనుప బాక్సులతో చిన్నపాటి గదులను నిర్మించింది. ఊర్లో ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చినా ఊరు మొత్తం ఇనుము బాక్సుల్లో రెండు వారాల పాటు క్వారంటైన్‌  కావాల్సిందే. పిల్లలు, గర్భిణులు, వృద్ధులనే తేడా లేదు. అందరినీ తీసుకెళ్లి క్వారంటైన్‌ బాక్సుల్లోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు 2 కోట్ల మంది చైనీయులు ఈ బాక్సుల్లోనే క్వారంటైన్‌ అయి ఉన్నారు. జీవో కోవిడ్‌ పాలసీని అక్కడి సర్కారు కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. కొన్ని  గ్రామాల్లో అయితే అర్ధరాత్రి వచ్చి నిద్రలేపి నిమిషాల్లో క్వారంటైన్‌ కేంద్రాలకు తరలి రావాలని హుకుం జారీ చేస్తున్నారు. బస్సుల్లో వారిని తరలిస్తున్నారు. ట్రాక్‌, ట్రేసెస్‌ యాప్స్‌ను అధికారులు వినియోగిస్తున్నారు. ఇనుప బాక్సులో ఒక బెడ్‌, ఒక టాయిలెట్‌ మాత్రేమ ఉంటుంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :