ప్రపంచ దేశాలన్నీ దీన్ని ఓడించాలి : జిన్పింగ్
కరోనా మహమ్మారిని అధిగమించడానికి ఉమ్మడి చర్యలే ఏకైక మార్గమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరమ్కు చెందిన దావోస్ అజెండా వారం రోజుల శిఖరాగ్ర సమావేశంలో మొదటి రోజు ఆయన ప్రసంగించారు. కరోనా వైరస్ను కట్టడి చేసే వ్యాక్సిన్లను సక్రమంగా పంపిణీ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవాళి ఈ మహమ్మారిని ఎదుర్కొని ముందుకు సాగుతుందని, అయితే ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా దీన్ని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత సరళృకృతం చేయడంతో పాటు ప్రపంచ దేశాల మధ్య మరింత సహకారం ఉండాలన్నారు. కంచెలను అడ్డుగోడలను తొలగించి మరింత గొప్పగా పరస్పరం సహకరించుకోవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. మహమ్మారి కారణంగా కొన్ని వర్ధమాన దేశృాలు పేదరికంలోకి జారిపోయాయని, ఇంకోవైపు అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.