పెట్టుబడులు ఎక్కడున్నాయి జగన్?.. వైసీపీ సర్కారుపై చంద్రబాబు ఫైర్
అభివృద్ధిలో ఏపీ వెనుక పడిపోయిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. తాజాగా ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ చేసిన ఓ ట్వీట్ను చూపిస్తూ ఆయన జగన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా ఆకర్షించిన రాష్ట్రాల జాబితాను ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా సంస్థ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్పై చంద్రబాబు స్పందించారు. ఈ జాబితాలో ఆంధప్రదేశ్ ఎక్కడుంది జగన్? అని ప్రశ్నించారు. ‘పాలనలో నీ వైఫల్యాల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాబితాలో ఏపీ 13వ స్థానానికి దిగజారింది’ అని మండిపడ్డారు. ‘దోచుకో, పంచుకో, తినుకో విధానంతో నువ్వు ఎదిగావు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం అయ్యావు. కానీ ప్రజలు మాత్రం కనీస అవసరాలు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. నీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు" అని చంద్రబాబు అన్నారు.