ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆషాడ బోనాలకు ముహూర్తం ఖరారు

ఆషాడ బోనాలకు ముహూర్తం ఖరారు

ఆషాడంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్‌ 22న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటించారు. జులై 9న  సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు, 10న రంగం, 16న ఓల్డ్‌ సిటీ బోనాలు, 17న ఊరేగింపు, జూన్‌ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎస్‌ శాంతి కుమారి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీ కుమార్‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిల పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :