ఆషాడ బోనాలకు ముహూర్తం ఖరారు
ఆషాడంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 22న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటించారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10న రంగం, 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఊరేగింపు, జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిల పాల్గొన్నారు.
Tags :