Radha Spaces ASBL

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో జేపీ నడ్డా

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో జేపీ నడ్డా

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నది. పార్లమెంట్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.  ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని, కనకమేడల రవీంద్‌ తదితరులు  పాల్గొన్నారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా టీడీపీ నేతలతో కలిశారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడకు చేరుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీలకు నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా వాజ్‌పేయి హయాంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య అనుబంధాన్ని నడ్డాకు తెలుగుదేశం ఎంపీలు వివరించారు. టీడీపీతో బీజేపీకి ఉన్న సంబంధాలు తనకు తెలుసు అని ఆయన తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :