ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులతో దశాబ్ది ఉత్సవాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఉత్సవాల విజయవంతంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags :