Radha Spaces ASBL

సుదీర్ఘకాలం తర్వాత తెలుగువారికి దక్కిన అరుదైన అవకాశం

సుదీర్ఘకాలం తర్వాత తెలుగువారికి దక్కిన అరుదైన అవకాశం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో తెలుగువారికి సుదీర్ఘకాలం తర్వాత అరుదైన అవకాశం దక్కింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధామన్‌ స్పేస్‌ సెంటర్‌లో షార్‌లో అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బద్రీ నారాయణమూర్తిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపెల్షన్‌ రీసెర్చ్‌ కాంప్లెక్సు (ఐపీఆర్‌సీ) సంచాలకులుగా నియమిస్తూ ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన ఆయన 1987 నుంచి ఇస్రోలో వివిద హోదాల్లో పనిచేస్తూ సంచాలకుని స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు షార్‌ నుంచి సంచాలకులుగా పదోన్నతిపై  ఇతర ఇస్రో కేంద్రాలకు వెళ్లినవారు ఎవరూ లేరు. తొలిసారి వెళ్తున్నది ఎంబీఎన్‌ మూర్తి మాత్రమే. ఆయన కోయంబత్తూరులోని పీఎస్‌జీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :