ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రామ్‌దేవ్‌ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు

రామ్‌దేవ్‌ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు

దేశంలో జనాభా నియంత్రణపై యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నదన్నారు. అందుకే దేశ జనాభా నియంత్రణకు పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. దేశంలో జనాభా 140 కోట్లకు చేరుకున్నదని, ఇంతకుమించి అధికంగా జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.  ఇప్పుడున్న జనాభాకు దేశంలో రైల్వే, ఎయిర్‌ పోర్టు, కాలేజీ, యూనివర్సిటీ, ఉపాధి కల్పన సేవలు అందించడమే చాలా ఎక్కువన్నారు. అందుకే పార్లమెంట్‌లో జనాభా నియంత్రణకు చట్టం చేయాలని, అప్పుడే దేశంపై అధికభారం పడదన్నారు. ఉత్తరాఖండ్‌కు తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్టవ్‌కు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :