హైదరాబాద్ లో కాన్సులేట్ ఏర్పాటు చేయండి
దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరాలను తీర్చేందుకు హైదరాబాద్లో ఆస్ట్రేలియా కాన్సులేట్ ఏర్పాటు చేయాలని ఆ దేశ హైకమిషనర్ బ్యారీ ఓఫారెల్ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. హై కమిషనర్ ఢిల్లీలో జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ భేటీలో ఇరుదేశాలకు సంబందించిన పలు అంశాలపై వారు చర్చించారు. ఆస్ట్రేలియా పురోగతిలో భారతీయుల పాత్రను ఓఫారెల్ శ్లాఘించారు. ఈ సందర్భంగా హై కమిషనర్కు జస్టిస్ ఎన్వీ రమణ భారత రాజ్యాంగ ప్రతి, బొబ్బిలి వీణ హస్తకళాకృతిని బహూకరించారు.
Tags :