కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆటా నాయకులు
కాన్ఫరెన్స్ కు ఆహ్వానించిన అధ్యక్షుడు భువనేష్ బుజాల
అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు భువనేష్ బుజాల ఇండియా పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. వచ్చే సంవత్సరం జూలైలో నిర్వహించే 1-3 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించే అమెరికా తెలుగు సంఘం 17వ మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా భువనేష్ మాట్లాడుతూ, అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ తెలుగు కమ్యూనిటీకి అమెరికా తెలుగు సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కోవిడ్ టైమ్లో చేసిన ప్రత్యేక సహాయ కార్యక్రమాలను కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటా నాయకులు కూడా పాల్గొన్నారు.
Tags :