ఆషా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
మాజీ నటి ఆషా పరేఖ్ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2020 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహుకరించనున్నట్టు మంత్రి వెల్లడిరచారు. ఆషా పరేఖ్ వయసు 79 ఏళ్లు. 66వ జాతీయ ఫిల్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆషాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. ఆషా పరేఖ్ 95 చిత్రాల్లో నటించారు. దిల్ దేకే దేకో, కటీ పతంగ్, తీస్రీ మంజిల్, బహారోంకే సప్నే, ప్యార్ కా మౌసమ్, కారవాస్ లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. 1952లో రిలీజైన ఆస్మాన్ చిత్రంలో ఆమె బాలనటిగా చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు బాప్ బేటీ చిత్రంలో నటించింది. ఘోరా కాగజ్ టీవీ షోలో ఆమె పాత్రను పోషించారు. ఆషా పరేఖ్ను 1992లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.