రాహుల్ పర్యటన సక్సెస్ చేద్దాం.. ప్రవాస భారతీయులకు రుద్రరాజు పిలుపు
అమెరికాలోని న్యూజెర్సీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 4వ తేదీ పర్యటనను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అమెరికాలోని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అనేక సవాళ్లు సమస్యలు ఉన్నాయని అన్నారు. దేశ ప్రగతి పురోగతి కోసం అభివృద్ధి గురించి చర్చించటానికి రాహుల్ గాంధీ వినిపించటం కోసం ఈ ముఖముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమెరికాలోని ప్రవాస భారతీయులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అరటి కృష్ణాజి, రాజేశ్వర్ గంగసాని, ప్రదీప్ శ్యామలా, శ్రీనివాసరావు భీమినేని, రామ్మోహన్రావు గాదుల, బొర్రా సుజన సాయి, పవర్ దర్శి తదితరులు పాల్గొన్నారు.
Tags :