అప్పుడు ఉద్యమం తమ చేతుల్లో ఉండదు : బొప్పరాజు
ఉద్యోగ సంఘాల ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసింది, కానీ ఆర్థికాంశాలతో ముడిపడిన డిమాండ్లు పరిష్కారం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జూన్ 8న గుంటూరులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 10లోపు ప్రభుత్వం స్పందించకుంటే నాలుగోదశ ఉద్యమం చేపడతామని తెలిపారు. గత 84 రోజులుగా తమ ఉద్యమం కొనసాగిస్తున్నామని దీన్ని చులకగా చూస్తే ప్రభుత్వానిదే తప్పు అని అన్నారు. నాలుగో దశలో ఉద్యోగులు ప్రత్యక్షంగా పాల్గొంటారని, అప్పుడు ఉద్యమం తమ చేతుల్లో ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎస్తో చర్చలకు వెళ్లనున్నట్లు తెలిపారు.
Tags :