Radha Spaces ASBL

ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఎస్ఐ నోటిఫికేషన్ పై హైకోర్టు సే

ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఎస్ఐ నోటిఫికేషన్ పై హైకోర్టు సే

ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సై నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్‌ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. బాధితుల తరపున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని పోలీసు నియామక బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరగా, ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ఎస్నై నోటిఫికేషన్‌ పై స్టే విధించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :