ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...కృష్ణంరాజు గౌరవార్థం
రెబల్స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మెగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్కరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా విషయాన్ని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్కరణ సభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెబ్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి హాజరయ్యారు. టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు కలసి మంత్రులంతా సానుభూతి తెలిపారు.
Tags :