Radha Spaces ASBL

వైసీపీ పోస్టర్ వార్....

వైసీపీ పోస్టర్ వార్....

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలను దెబ్బకొట్టేందుకు వైసీపీ వదిలిన బ్రహ్మాస్త్రం.. అద్భుతంగా వర్కౌవుట్ అవుతోందా? వైసీపీ కొత్త స్లోగన్ పేదలు-పెత్తందార్ల మధ్య యుద్ధం.. టీడీపీ, జనసేనలను కంగారెత్తిస్తోందా? తణుకుతో పాటు పలుచోట్ల వెలసిన ఈపోస్టర్లపై...  జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. వీటిని తీసేయాలంటూ ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నాయి. అంటే ఈ పోస్టర్ పై జనంలో అంతగా చర్చ జరుగుతోందన్న మాట..

ఇప్పుడు జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇదే విషయాన్ని పదేపదే వినిపిస్తున్నారు. తన స్లోగన్ కు తగ్గట్లే పార్టీ పెద్ద పోస్టర్ ను కూడా డిజైన్ చేసింది. పోస్టర్లో పెత్తందార్లుగా జగన్ అభివర్ణిస్తున్న చంద్రబాబునాయుడు, లోకేష్ పల్లకిలో కూర్చునుంటారు. వీళ్ళు కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు మరికొందరు మోస్తుంటారు. వీళ్ళపక్కనే ఉన్న కొందరు పోస్టర్లో మరోవైపున్న పేదలపై రాళ్ళు వేస్తుంటారు. పెత్తందార్లు విసురుతున్న రాళ్ళు పేదలకు తగలకుండా వాళ్ళకి ముందు జైగాంటిక్ పర్సనాలిటీతో జగన్ కూర్చునుంటారు. అంటే పెత్తందార్లు విసిరే రాళ్ళదెబ్బలన్నింటినీ పేదలకు తగలకుండా మధ్యలో జగనే కాపుకాస్తుంటారని అర్ధం వచ్చినట్లు పోస్టర్ ప్రిపేర్ చేశారు..

అమరావతి ప్రాంతంలో మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో  ఒకేసారి 51వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ కార్యక్రమంతో జగన్ కాన్సెప్టుపై జనాల్లో మరింత చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతిలో పేదలకు చోటు లేదా, ధనికులకే స్థానమా అంటూ ఇప్పటికే పలుసందర్భాల్లో వైసీపీనేతలు ప్రశ్నిస్తున్నారు. పేదలు లేని రాజధాని అవసరమా అంటూ ప్రశ్నించిన సందర్భాలున్నాయి.ఈ సందర్భంలోనే పోస్టర్ ప్రిపేర్ చేసి జగన్ అండ్ టీమ్.. టీడీపీ, జనసేనపై వదిలినట్లు భావిస్తున్నారు.

ఎన్నికల్లో స్లోగన్లే పార్టీకి పెద్ద బూస్టప్ ఇస్తాయన్న విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లో బైబై బాబు అనే స్లోగన్ బ్రహ్మాండంగా వర్కవుటైంది. ఇప్పుడు పేదలు-పెత్తందార్ల యుద్ధం.. మరి ఈపోస్టర్ .. ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. దీనికి చంద్రబాబు టీమ్ ఎలాంటి కౌంటర్ అవలంభిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :