నేడు సీఎం వైఎస్ జగన్ పారిస్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారిస్కు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి (జూన్ 28వ తేదీ) 7:30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు విమానంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 5:10 గంటలకు పారిస్ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్నొకేషన్ వేడుకలో పాల్గొననున్నారు. తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు పారిస్లో బయలుదేరి, 3వ తేదీ ఉదయం 6:45 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
Tags :