చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక శ్రీరామనవమి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, శ్రీరాముడు ధర్నాన్ని నిలబెట్టిన తీరుకు ఉదాహరంగా శ్రీరామనవమి నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మాన్ని పాటిస్తూ దయాగుణంతో మనమంతా జీవితంలో ముందుకు వెళ్లేందుకు శ్రీరాముడు మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని, వారి దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాక్షించారు.
Tags :