
తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ల గడువు ముగిసింది. ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్, మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ ల గడువు ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ లను అధికారులు పరిశీలించనున్నారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 60 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేష్ ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.