
కరోనా వ్యాప్తి అనంతరం పాఠశాలల పునర్ ప్రారంభించడంపై న్యూయార్క్ నగర మేయరు బిల్ డీ బ్లాసియో తాజా ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి అనంతరం న్యూయార్కు నగరంలో డిసెంబరు 7వ తేదీ నుంచి పబ్లిక్ స్కుళ్లను పునర్ ప్రారంభించనున్నట్లు న్యూయార్కు నగర ఏయర్ బిల్ డీ బ్లాసియో ప్రకటించారు. 3 కే, ప్రీ కె, కె-5 విద్యార్థుల కోసం న్యూయార్కు నగరంలోని 75 పాఠశాలలు తెరుస్తామని మేయర్ ట్వీట్ చేశారు. న్యూయార్కు నగరంలో గతంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పాఠశాలలను మూసివేశారు. అమెరికాలో 13,363,182 కరోనా కేసులు నమోదు కాగా 2,66,813 మంది కరోనాతో మరణించారని జాన్ హాప్కిన్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.