
సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ పయానికి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ ప్రవేశంపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు ఆయన తెలిపారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాలో కార్యదర్శులతో రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అభిప్రాయాలను కలుబోసుకున్నాం. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. సాధ్యమైనంత తొందరలో నా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.
కాగా, రజనీకాంత్ చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో ఆయన మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత సృష్టత వస్తుందని ఎదరు చూసినా అభిమానులకు నిరాశే మిగిలింది. తన రాజకీయ ప్రవేశంపై రాజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.