
బెంగళూరు నగరం నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియా నాన్స్టాప్ విమానాన్ని నడపనుంది. 2021 జనవరి 11న తొలి విమానం బెంగళూరు నుంచి బయల్దేరనుంది. ఈ విషయాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. మన దేశం నుంచి సుదీర్ఘ సమయం ప్రయాణించనున్న తొలి విమానం ఇదే. బెంగళూరు నుంచి 14 వేల కిలోమీటర్ల దూరాన్ని 16 గంటలపాటు నిరంతరాయంగా ప్రయాణించి ఈ విమానం శాన్ఫ్రాన్సిస్కో చేరుకోనుంది. ఇప్పటికే టికెట్ల రిజర్వేషన్ను ప్రారంభించామని వారంలో రెండు రోజుల పాటు ఈ విమాన సేవలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.