
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 28న ఢిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్పేట సమీపంలోని భారత్ బయెటెక్ను మోదీ సందర్శించనున్నారు. కొవిడ్ నివారణకు సంబంధించి భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కొవాగ్జిన్ టీకా పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ప్రధాని పుణె పర్యటనకు వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్కు రానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు ఇప్పటికే బీజేపీ జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 28న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 29న కేంద్ర హోంమంత్రి అమిత్షా హైదరాబాద్ రానున్నారు. వీరంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే రోడోషోల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ రానుండటం ఆసక్తికరంగా మారింది.