
ప్రముఖ డబ్బులు చెల్లింపుల సంస్థ అయిన గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి గూగుల్ పే వెబ్యాప్ సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపింది. అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటి వరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్ను వినియోగించే వారు. 2021 ప్రారంభంలో, మీకు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.com ను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్ను ఉపయోగించండి అని కంపెనీ అమెరికా ప్రజలకు సమచారం ఇచ్చింది.
గూగుల్ పే వెబ్ యాప్లో ..పీర్-టూ-పీర్ పేమెంట్ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు కూడా అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమేనని భారత యూజర్లకు కాదని తెలిపింది. ఐఓఎస్, ఐఓఎస్ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.