
ప్రపంచంలోనే అతిపెద్ద మాల్గా పేరుగాంచిన దుబాయ్ మాల్ తిరిగి ప్రారంభమైంది. అయితే కొన్ని షరతులతో తిరిగి రీఓపెన్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాల్కు వచ్చే వారికి కొన్ని షరతులు విధించారు. మాల్కు వచ్చే కస్టమర్స్ మాస్క్ థరించడంతో పాటు మాల్ పార్కింగ్, ఎంట్రన్సలో ఫీవర్ పరీక్షలు చేయించుకోవాలి. ఇంకా వచ్చేవారు మూడు గంటలకు మించి ఎవరు కూడా మాల్లో ఉండకూడదు. మూడేళ్ల నుంచి 12 ఏండ్లు, అరవై ఏళ్ల పైబడిన వారికి మాల్లోకి అనుమతి లేదు. కరోనా వ్యాప్తి కారణంగా దుబాయ్లో మార్చి 23 నుంచి లాక్డౌన్ విధించారు. దీంతో అన్ని మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డాయి. దాదాపు నెల రోజుల తర్వాత మాల్ తెరుచుకోవడంతో వెల్కమ్ బ్యాక్ అని రాసి ఉన్న నల్ల టీషర్ట్లు వేసుకున్న మాల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి టెంపరేచర్ చెక్ చేస్తూ, వెల్కమ్ చెప్పారు.