కేంద్రం సంచలన ప్రకటన.. జగన్ పాలనలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించింది. దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని తెలిపింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినా ఏపీతో పాటు మరో రెండు మూడు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు. కర్నాటక, మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో 2017లో 375 మంది, 2018లో 365 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తోమర్ తెలిపారు. అలాగే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు.