కార్తీకేయ సరసన లావణ్య త్రిపాఠి?
హీరోయిన్ లావణ్య త్రిపాఠికీ రీసెంట్గా అర్జున్ సురవరంతో మంచి హిట్ దక్కింది. స్టార్ హీరోల సినిమాల్లో చాన్సులు ఎలా ఉన్నా.. ఓ యంగ్ హీరో సినిమాలో మాత్రం నటించబోతున్నట్టు తెలిసింది. కార్తీకేయ హీరోగా తెరకెక్కబోతున్న చావు కబురు చల్లగా చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించబోతోంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. కాగా కౌశిక పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ మూవీ విభిన్న కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మాతగా రానుంది. కార్తికేయ ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో కన్పించబోతున్నాడు.
Tags :