ఏపీ సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ నియామకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయూలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తారని సీఎస్ తెలిపారు.