10th July 2026

__________

- Saidulu

గొంతుకు రొంపని క్షణాల్లో తగ్గించే కాషాయాలు

గొంతు రొంప, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే సులభంగా చేసుకునే కాషాయాలతో ఉపశమనం పొందండి.

అల్లం ముక్కలను నీటిలో మరిగించి తేనె కలిపి తాగితే గొంతు రొంప, నొప్పి తగ్గడానికి తోడ్పడుతుంది.

అల్లం కాషాయం

తులసి ఆకులు, మిరియాలు మరిగించి తాగితే గొంతు సేదతీరడంతో పాటు జలుబు లక్షణాలు తగ్గేందుకు సహాయపడుతుంది.

తులసి కాషాయం

పసుపు, మిరియాల పొడి, నీటితో చేసిన కాషాయం గొంతుకు ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది.

పసుపు కాషాయం

దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తేనె కలిపి తాగితే గొంతు అసౌకర్యం తగ్గేందుకు సహాయపడుతుంది.

దాల్చిన చెక్క కాషాయం

లవంగాలు మరిగించిన నీరు గొంతును తేమగా ఉంచి రొంప తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

లవంగాల కాషాయం

వాము నీటిలో మరిగించి గోరువెచ్చగా తాగితే గొంతులోని అసౌకర్యం తగ్గి ఉపశమనం లభిస్తుంది.

వాము కాషాయం

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే గొంతు మంట తగ్గి హాయిగా అనిపిస్తుంది.

నిమ్మ-తేనె కాషాయం

కాషాయాలు ఎప్పుడూ గోరువెచ్చగా తాగండి. రోజంతా తగినంత నీరు తాగడం కూడా గొంతు ఆరోగ్యానికి మంచిది.

గొంతు రొంప, నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే లేదా జ్వరం, శ్వాస సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.