అలా ఎలా మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్.
ఆ తర్వాత కుమారి 21ఎఫ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వచ్చిన ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది.
ఆ సినిమా తర్వాత హెబ్బాకు చాలానే ఆఫర్లు వచ్చాయి.
ఎన్ని సినిమాలు చేసినా హెబ్బాకు లక్ మాత్రం కలిసి రాలేదు.
ఆఖరికి స్పెషల్ సాంగ్స్ చేసినా అవి కూడా ఆమెకు క్రేజ్ ను తెచ్చిన పెట్టలేదు.
మొన్నా మధ్య ఓదెల2 సినిమాలో మెరిసిన హెబ్బా ఆఖరిగా ఈషా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది.
కెరీర్లో కంబ్యాక్ ఇవ్వడానికి హెబ్బా ఓ మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది.