సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా వారణాసి.
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రూ.1200 కోట్ల భారీ బడ్జెట్ తో వారణాసి సినిమాను కె.ఎల్ నారాయణ, ఎస్.ఎస్ కార్తికేయ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
కోయ్మోయ్ తాజా కథనం ప్రకారం వారణాసి ఓవర్సీస్ రైట్స్ ఏకంగా రూ.160 కోట్లకు క్లోజ్ అయినట్టు సమాచారం.
సౌత్ ఇండియాలోనే అత్యధిక డిజిటైల్ రైట్స్ అమ్ముడైన సినిమాగా వారణాసి సరికొత్త రికార్డును సృష్టించింది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి, 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.