బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.
మహేష్ బాబు తో కలిసి భరత్ అనే నేను సినిమా చేసి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా, మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది.
భరత్ అనే నేను హిట్ తర్వాత రామ్ చరణ్ కు జోడీగా వినయ విధేయ రామ మూవీలో నటించగా, ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
తర్వాత మరోసారి చరణ్ కు జోడీగా గతేడాది గేమ్ ఛేంజర్ మూవీలో కనిపించగా, ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ముచ్చటగా మూడో సారి చరణ్ తో జత కట్టేందుకు కియారా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కియారా నటించే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Kiara Advani ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ, టాలీవుడ్లో మరో భారీ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తిగా ఉన్నట్టు టాక్.
AI Earning Tips: ఏఐతో డబ్బు
చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ........